ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసేసి పక్కన ఉంచుకోవాలి.
అదే నూనెలో ఒక బిర్యానీ ఆకు, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, అనాస పువ్వు, జీలకర్ర వేసి ఒక నిమిషం వేయించాలి.
ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, వేసి బాగా కలపాలి.
టమాటో గుజ్జు, పచ్చి బటాణి వేసి కలిపి నూనె అంచులకు ఊరేవరకు ఉడికించాలి.
పనీర్ ముక్కలను వేసి ఒక సారి బాగా కలిపి, పైన సగం గరం మసాలా చల్లి మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
మూత తెరిచి పాలు, క్రీమ్, కొద్దిగా నీళ్ళు పోసి కలిపి మిగిలిన గరం మసాలా, కసూరి మేతి కూడా వేయాలి.
ఒక సారి కలిపి గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి.
చివరిగా బటర్, జీడిపప్పు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి.