Print
prawns pulao telugu recipe

Prawns Pulao Telugu Recipe

Course Main Course
Cuisine Andhra, Hyderabadi, Telangana
Prep Time 30 minutes
Cook Time 30 minutes
Total Time 1 hour
Servings 3
Author బిందు

Ingredients

మారినేషన్ కొరకు

  • 350 గ్రాములు పెద్ద రొయ్యలు
  • 1 ½ tsp ఉప్పు
  • ½ tsp పసుపు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
  • 2 tbsp పచ్చి మిర్చి ముద్ద
  • 1 tsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 రెమ్మ పుదీనా

నానబెట్టుటకు

  • 3 కప్పులు లేదా ౩౭౫ గ్రాములు బాస్మతి బియ్యం( 1 కప్ = 125 గ్రాములు)
  • నానబెట్టుటకు సరిపడి నన్ని నీళ్ళు

కూర కొరకు

  • 4 tbsp నూనె
  • 1 tbsp నెయ్యి
  • 2 బిర్యానీ ఆకులు
  • 1 అనాస పువ్వు
  • 2 ఏలకులు
  • 2 దాల్చిన చెక్కలు అంగుళం పొడవు
  • 4 లవంగాలు
  • 1 పువ్వు జాపత్రి
  • 1 ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరిగినది
  • 1 రెమ్మ కరివేపాకు
  • 1 టమాటో
  • ½ tbsp ధనియాల పొడి
  • ఏలకులు మరియు సోంపు పొడి
  • 1 tsp పలావు మసాలా
  • ¼ కప్ కొత్తిమీర
  • చేతి నిండా పుదీనా ఆకులు

మసాలా కొరకు

  • 3 ఏలకులు
  • 1 tsp సోంపు

పలావు కొరకు

  • 4 ½ కప్పులు లేదా 700 ml నీళ్ళు
  • ¼ కప్పు పుదీనా
  • ¼ కప్పు కొత్తిమీర

Instructions

మారినేట్ చేయుట

  1. రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
  2. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు నాననివ్వాలి.

బియ్యం నానబెట్టుట

  1. రొయ్యలకు మసాలా పట్టించడం అవగానే బియ్యాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టాలి.
  2. బియ్యం నానిన తరవాత వండే ముందు 2 నుండి 3 సార్లు స్టార్చ్ పోయే వరకు శుభ్రంగా కడగాలి.

మసాలా తయారీ

  1. ఏలకులు మరియు సోంపు ను ఒక పెనంలో దోరగా వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.

కూర వండుట

  1. ఒక పాత్రలో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేయాలి.
  2. అందులో బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, ఏలకులు, జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
  6. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, ఏలకులు మరియు సోంపు పొడి, పలావు మసలా వేసి బాగా కలపాలి.
  7. మారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి 15 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.

పలావు తయారీ

  1. బియ్యాన్ని కొలవడానికి వాడిన కప్పుతోనే ప్రతీ 1 కప్పు బియ్యానికి 1 ½ కప్పు చప్పున నీళ్ళు పోయాలి.
  2. నీళ్ళలో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి మరిగే వరకు ఉడికించాలి.
  3. నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
  4. అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
  5. ఉడకడం మొదలవగానే ఒకసారి ఉప్పు సరి చూసుకొని, పైన మూత పెట్టి సిమ్ లో ఉంచి అన్నం సరిగ్గా ఉడికే వరకు వండి స్టవ్ కట్టేయాలి.