1కప్పుబెల్లం + ½ కప్పు(ఒక వేళ మీరు డ్రై ఫ్రూట్స్ వాడితే)
½tspయాలకుల పొడి
2 లేదా 3tbspనెయ్యి
3కప్పులులేదా 750 ml నీళ్ళు
10బాదం పప్పులు
10జీడిపప్పులు
10పిస్తా పప్పులు
2tbspపల్లీలు
¼కప్పుఎండు కొబ్బరి పొడి
ఇతరములు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
Instructions
పిండి తయారు చేయుట
మినపప్పు మరియు బియ్యం కలిపి ఒక రాత్రంతా లేదా 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
రుబ్బే ముందు 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి.
పప్పు ని బియ్యాన్ని మిక్సీలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరీ గారెల పిండిలా గట్టిగా లేదా దోసెల పిండిలా మరీ జారుగా కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలి.అంటే పిండి కొద్దిగానే జారుగా ఉండాలి.
రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 tbsp ల మైదా పిండి కొద్దిగా సోడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
పప్పును ఉడికించుట
పచ్చి సెనగ పప్పును రెండు మూడు సార్లు కడిగి 3 కప్పుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
ఉడకడం మొదలవ్వగానే సెగ కాస్త తగ్గించి పప్పు సరిగా ఉడికే వరకు మరిగించాలి.
పప్పు మెత్తగా పేస్ట్ లా కాకుండా పప్పుగానే ఉండాలి.కానీ పప్పుని ని రెండు వేళ్ళతో నొక్కి నప్పుడు అది నలిగేట్లుగా ఉడికించాలి.
తర్వాత పొయ్యి కట్టేసి పప్పు లో నీళ్ళు వడకట్టేయాలి.
ఫిల్లింగ్ కొరకు
జీడి పప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు మరియు పల్లీలను వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పు ని కూడా పొడి ల చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణలిలో రుబ్బిన పచ్చి సెనగ పప్పు, బెల్లం, జీడి, బాదం, పిస్తా&పల్లీ పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బెల్లం కరికే వరకు కలపాలి.
ఒక్క సారి బెల్లం కరగడం మొదలవగానే యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి గట్టిగా హల్వా లా అయ్యే వరకు కలుపుతుండాలి.
పొయ్యి కట్టేసి బాణలి ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి.
పూర్ణాలు తయారు చేయుట
ఫిల్లింగ్ స్టఫ్ నిమ్మకాయంత పరిమాణంలో సమానంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా చేసి పెట్టుకున్న మినప మరియు బియ్యం పిండిలో ఆ ఉండలను వేయాలి.
ఆ ఉండలకు పిండి సరిగ్గా అంటేలా చూసుకోవాలి.ఎక్కడా లోపలి పిండి బయటికి కనపడకూడదు.
ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి చక్కని బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి.
వేయించిన వాటిని పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.
Recipe Notes
పూర్ణాలను తుంపి కొద్దిగా కరిగిన నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.