Print

Vegetable Sambar Telugu Recipe

Course Main Course
Cuisine Andhra, Hyderabadi, South Indian, Telangana
Prep Time 35 minutes
Cook Time 35 minutes
Total Time 1 hour 10 minutes
Author బిందు

Ingredients

పప్పు ఉడికించుట కొరకు

  • 1 కప్పు లేదా 200 గ్రాములు కందిపప్పు
  • ½ tsp పసుపు
  • 1 లీటరు నీళ్ళు

చింతపండు రసం కొరకు

  • 15 లేదా 20 గ్రాములు చింతపండు
  • 200 ml నీళ్ళు

కావాల్సిన కూరగాయలు

  • 1 పెద్ద ఉల్లిపాయ
  • 3 పచ్చిమిరపకాయలు
  • 1 క్యారెట్
  • 1 మునక్కాడ
  • 1 టమాటో
  • 200 గ్రాములు సొరకాయ ముక్కలు
  • 4 కరివేపాకు రెమ్మలు

సాంబారు కొరకు

  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండుమిరపకాయలు
  • ¼ పసుపు
  • 1 tsp కారం
  • 1 tsp మిరియాల పొడి
  • 1 tsp సాంబారు పొడి
  • 1 tbsp నెయ్యి
  • 3 tbsp నూనె
  • ¼ కప్పు కొత్తిమీర

Instructions

పప్పు ఉడికించుట

  1. కందిపప్పు ని రెండు మూడు సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి.
  2. కందిపప్పు కన్నా 2 సెంటీమీటర్లు ఎక్కువ వచ్చే వరకు నీళ్ళు పోయాలి.
  3. కుక్కర్ మూత మరియు విజిల్ పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

చింతపండు రసం తయారీ

  1. చింతపండు ని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టాలి.
  2. తర్వాత రసం పిండి వడకట్టాలి.
  3. మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసి రసం పిండాలి.ఇలా చింతపండు పిప్పి లా మారే వరకు చేయాలి.
  4. ఉడికిన పప్పుని మెత్తగా చేసి అందులో చింతపండు రసం కూడా పోసి కలపాలి.ఇంకో ముప్పావు లీటరు నీళ్ళు పోసి పక్కన ఉంచుకోవాలి.

సాంబార్ తయారీ

  1. ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి.
  2. నూనె కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
  3. తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి మగ్గే వరకు ఉడికించాలి.
  4. కూరగాయలు మగ్గాక, పసుపు, కారం వేసి కలిపి పప్పు చింతపండు రసం మిశ్రమాన్ని పోసి ఒక మరుగు వచ్చే వరకు కాయాలి.
  5. మరగడం మొదలవగానే అందులో మిరియాల పొడి, సాంబార్ పొడి, నెయ్యి వేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించాలి.ఉప్పు సరిచూసుకోవాలి.
  6. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి.