ఒక పెనంలో 2 tbsp నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, మినప పప్పు, పచ్చి మిర్చి, చింతపండు వేసి పచ్చి మిరపకాయలు రంగు మారే వరకు వేయించాలి.
తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
అదే పెనంలో మరో 3 tbsp ల నూనె వేసి అందులో పచ్చి టమాటో ముక్కలు వేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి.
తర్వాత పుదీనా ఆకులు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
వేయించిన పదార్దాలన్నింటిని మిక్సీ జార్ లో వేసి అందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చా గా గ్రైండ్ చేసుకోవాలి.
కొత్తిమీర తరుగు వేసి వేడి వేడి అన్నంతో వడ్డించాలి.