పనీర్ ను మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక మిక్సింగ్ బౌల్ లో కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, కారం, తగినంత ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, డ్రై ఆరిగానో వేసి కలపాలి.
తర్వాత కొద్దిగా నీరు పోసి పేస్టులా కలుపుకోవాలి.
పనీర్ ముక్కలు అందులో వేసి, పేస్ట్ ను ముక్కలకు బాగా పట్టించి 15 నుండి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఒక పెనంలో వెన్న వేసి కరిగించాలి.అందులో నానబెట్టిన పనీర్ వేసి సన్నని సెగ మీద 5 నిమిషాల పాటు రెండు వైపులా వేయించాలి.
మళ్ళీ ఒక 3 నిమిషాల పాటు రెండు వైపులా వేయించి స్టవ్ కట్టేయాలి.