కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
ఉడికించిన గుడ్లను సగానికి కోసి కూరలో వెయ్యాలి.
గరం మసాలా, కొబ్బరి పొడి వేసి ఇంకొకసారి కలపాలి.
మూత పెట్టి 3 నుండి 5 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి.
మూత తెరిచి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి.