ఒక ప్రెషర్ పాన్ లో నూనె పోసి వేడి చేయాలి.
నూనె కాగాక, 3 లవంగాలు, 2 యాలుకలు, ½ అంగుళం దాల్చిన చెక్క వేయాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసి కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి ఇంకో రెండు నిమిషాలు ఉడికించాలి.
పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి 5 నిమిషాలు మీడియం సెగ మీద వేయించాలి.
తర్వాత 2 కప్పులు నీళ్ళు పోసి, షాజీరా ఇంకా పుదినా వేసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఆవిరంతా పోయే వరకు వదిలేసి తర్వాత మూత తెరవాలి.