చేపల చెట్టి లో నూనె పోసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి, మెంతులు&జీలకర్ర&ఆవాలు పొడి వేసి కలపాలి.
మామిడికాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
మూత తెరచి, చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి.
అందులో 500 ml నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
పులుసు మరగడం మొదలవ గానే అందులో చేప ముక్కలు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఉల్లికాడ తరుగు, కొత్తిమీర వేసి పొయ్యి కట్టేయాలి.