ఒక పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి.
ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేయించాలి.
పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
కారం, ధనియాలపొడి వేసి కలపాలి.
ముందుగా ఉడికించి పెట్టుకున్న చామగడ్డలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
మూత తెరిచి ఒకసారి కలిపి చింతపండు రసం పోయాలి.
జీలకర్ర&మెంతుల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కూర చిక్కబడేవరకు ఉడికించాలి.
కొత్తిమీర తరగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.