ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి.
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమరపకాయలు వేసి మగ్గే వరకు వేయించాలి.
తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత నానబెట్టిన చికెన్ వేసి ఒకసారి కలిపాలి.
మూత పెట్టి మీడియం సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతుండాలి.
చికెన్ లో ఉన్న తడి మొత్తం ఆవిరైపోయేవరకు ఉడికించాలి.
ఎప్పుడైతే నూనె కూర నుండి విడిపోయినట్లుగా కనిపిస్తుందో అప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 5 నిమిషాల పాటు ఎక్కువ సెగ మీద కలుపుతూ వేయించాలి.
కొత్తిమీర తరుగు వేసి పొయ్యి కట్టేసుకోవాలి.