ఒక ప్రెషర్ పాన్ లో 5 tbsp ల నూనె వేసి వేడిచేయాలి.
అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి.
పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత నానబెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించాలి.
మూత తెరిచి, చికెన్ మసాలా వేసి కలిపి, సుమారుగా అరలీటరు నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
అవిరంతా పోయేవరకు అలాగే వదిలేసి, తర్వాత మూత తెరిచి కొత్తిమీర తరుగు వేయాలి.