ఒక పెనం వేడి చేసి అందులో షాజీరా, సోంపు, బిర్యానీ పూలు, యాలుకలు, దాల్చినచెక్క, లవంగాలు, జాపత్రి వేసి ఒక నిమిషం పాటు వేపి స్టౌ కట్టేయాలి.
వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఉల్లిపాయలను డీప్ ఫ్రై చేయుట
ఉల్లిపాయల్ని చాలా సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి.
ఒక చిన్న బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.
నూనె కాగాక, ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి ముదురు గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి.
బాణలిలో నుండి బయటకు తీసే ముందు నునెని గట్టిగా నొక్కేసి ఉల్లిపాయలని పక్కన పెట్టుకోవాలి.
చేప ముక్కలను శుభ్రం చేయుట
చేప ముక్కల్ని బాగా కడిగి, ఒక అయిదు నిమషాల పాటు పసుపు, ఉప్పు వేసిన కలిపిన మజ్జిగలో నానబెట్టాలి.
తర్వాత మజ్జిగలో నుండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
బియ్యం నానబెట్టుట
500 గ్రాముల బియ్యాన్ని నీళ్ళలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
వండబోయే ముందు 2 నుంచి 3 సార్లు కడగాలి.
చేప ముక్కల్ని మారినేట్ చేయుట
ఒక మిక్సింగ్ బౌల్ లోకి చేప ముక్కల్ని తీసుకోవాలి.
అందులో ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, 3 వంతులు వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం, 4 నుండి 5 tbsp ల కాచిన నూనె, గిలకొట్టిన పెరుగు వేసి జాగ్రత్తగా కలపి 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
అన్నం వండే విధానం
ఒక గిన్నెలో 2.5 నుండి 3 లీటర్ల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు, కొద్దిగా నూనె, గరం మసాలా దినుసులు, పుదీనా వేసి మరిగించాలి.
నీళ్ళు మరగడం మొదలవగానే నానబెట్టి కడిగిన బియ్యం వేయాలి.
బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతాయి.
అందుకే మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకనివ్వాలి.
అన్నం ఉడకడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా 3 నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
వెంటనే అన్నంలోని నీళ్ళని వార్చేసుకోవాలి.
ఫిష్ దమ్ బిర్యానీ వండే విధానం
గిన్నెఅడుగున కొద్దిగా నూనె రాయాలి.
నానబెట్టుకున్న చేప ముక్కల్ని వేసి సమానంగా పరవాలి.
పైన సగం ఉడికిన అన్నం వేసి సమానంగా పరచాలి.
మిగిలిన వేయించిన ఉల్లిపాయలు, పుదీనా ఆకులు, కొద్దిగా నెయ్యి వేసి, అల్యూమినియం ఫాయిల్ తో గిన్నెని మూసేసి, దాని పైన మూత పెట్టాలి.
ఒక పెనాన్ని పొయ్యి వెలిగించి పెట్టుకోవాలి.దాని మీద బిర్యానీ పాత్రను కూడా పెట్టాలి.
హై ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు ఉడికించి తర్వాత సిమ్ లో ఉంచి 7 నుండి 10 నిమిషాల పాటు ఉడికించి పొయ్యి కట్టేయాలి.
కట్టేసిన వెంటనే మూత తెరవకుండా ఒక 15 నుండి 30 నిమిషాలు వదిలేయాలి.