ఒక పెనంలో నెయ్యి వేసి వేడిచేయాలి.
జీడి పప్పు, కిస్ మిస్ వేసి చక్కటి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
అందులో బొంబాయి రవ్వ వేసి 3-5 నిమిషాలు సన్నని సెగ మీద వేయించాలి.
తర్వాత ఎందు కొబ్బరి పొడి, యాలుకల పొడి, బాదం పప్పు తురుము, పంచదార వేసి ఒక రెండు నిమిషాలు సన్నని సెగ మీద కలిపి దించేసుకోవాలి.ఆ మిశ్రమాన్నికొద్ది నిమిషాల పాటు పూర్తిగా కాకుండా కొద్దిగా చల్లారనివ్వాలి.
ఈలోపుగా ఒక చిన్న గిన్నెలో స్ట్రాబెర్రీ క్రష్ గానీ, జామ్ గానీ వేసి దాన్ని ఒకసారి కలపాలి.
అందులో 3 tbsp ల కాచి చల్లార్చిన పాలు వేసి కలిపి దాన్ని రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
ఇప్పుడు చేతి నిండా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూ లను చుట్టాలి.
వాటిని ఎండు కొబ్బరి పొడిలో దొర్లిస్తే చూడడానికి బాగుంటాయి.