Print
hyderabadi prawns biryani recipe

Prawns Biryani Telugu Recipe

Course Main Course
Cuisine Hyderabadi, Indian
Prep Time 40 minutes
Cook Time 1 hour
Total Time 1 hour 40 minutes
Servings 4
Author బిందు

Ingredients

మసాలా కొరకు

  • 1 tbsp షాజీరా
  • 1 tbsp సోంపు
  • 4 యాలుకలు
  • 5 లవంగాలు
  • 2 inch దాల్చినచెక్క

వేయించిన ఉల్లిపాయలు కొరకు

  • 2 పెద్ద ఉల్లిపాయలు
  • 1 tbsp నూనె వేయించడానికి సరిపడా

మారినేషన్ కొరకు

  • 300 గ్రాములు రొయ్యలు
  • 300 గ్రాములు పెరుగు
  • సాల్ట్ తగినంత
  • 2 tbsp కారం
  • 2 tsp బిర్యానీ మసాలా
  • వేయించిన ఉల్లిపాయలలో సగం
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 నిమ్మకాయ
  • ½ కప్ పుదినా ఆకులు
  • 375 గ్రాములు పెరుగు

అన్నం కోసం

  • 300 లేదా 350 గ్రాములు బాస్మతి రైస్
  • 2 tbsp గరం మసాలా దినుసులు
  • 2 బిరియాని ఆకు
  • 1 tbsp సాల్ట్
  • ¼ కప్ పుదీనా ఆకులు
  • 2 tbsp నూనె

బిర్యానీ కొరకు

  • 4-5 tbsp నూనె
  • ¼ కప్ పుదీనా ఆకులు
  • 1 tbsp వేయించిన ఉల్లిపాయలు మిగిలినవి
  • ¼ tsp కుంకుమ పువ్వు కలిపిన పాలు లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్

Instructions

మసాలా తయారీ విధానం

  1. ఒక చిన్న పెనంలో షాజీరా, సోంపు, యాలుకలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి ఒక నిమిషం పాటు వేపి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

ఉల్లిపాయలు వేయించే విధానం

  1. ఒక కడాయి లో నూనె పోసి వేడి చేయాలి.
  2. సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కరకరలాడే వరకు వేయించాలి.
  3. నూనె లో నుండి బయటకి తీసేటప్పుడు గరిటెతో గట్టిగా నొక్కేస్తే నూనె అంతా కారిపోతుంది.కాసేపటికి ఉల్లిపాయలు కరకరలాడతాయి.

మారినేషన్ చేసే విధానం

  1. రొయ్యల్ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం, బిర్యాని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు సగం, సన్నని పచ్చిమిర్చి తరుగు, పుదీనా, నిమ్మ రసం మరియు పెరుగు వేసి బాగా కలిపి, ఒక అరగంట సేపు నాననివ్వాలి.

బియ్యం నానబెట్టుట

  1. రొయ్యల్ని మారినేట్ చేసిన వెంటనే బియ్యాన్ని కూడా నానబెట్టాలి.
  2. అరకేజీ బాస్మతి బియ్యం తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టాలి.

  3. తర్వాత బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి.

అన్నం వండుట కోసం

  1. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, అందులో సరిపడా ఉప్పు, గరం మసాలా దినుసులు, బిరియాని ఆకులు, నూనె, పుదీనా ఆకులు వేసి మరిగించాలి.
  2. నీరు మరగడం మొదలవగానే అందులో నానబెట్టిన బియ్యం వెయ్యాలి.
  3. బియ్యం వేయగానే నీరు మరగడం ఆగిపోతుంది.
  4. అందుకే మళ్ళీ మరిగే వరకు ఉడికించి, మరగడం మొదలైన దగ్గర నుండి 3-4 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
  5. కట్టేసిన వెంటనే నీరు వడకట్టేసి ఆ సగం ఉడికిన అన్నం పక్కన పెట్టుకోవాలి.

బిరియాని వండే విధానం

  1. ఒక మందపాటి అడుగు ఉన్న లోతైన గిన్నెలో, 4 నుండి 5 tbsp ల నూనె(ముందుగానే కాచినది) వేసి, నానబెట్టిన రొయ్యలు కుడా వేసి సమానంగా పరచుకునేలా సర్దాలి.
  2. తర్వాత దాని మీద సగం ఉడికిన అన్నం వేసి, పైన కొన్ని పుదినా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేం మీద, తర్వాత 7-10 నిమిషాలు సిమ్ మీద ఉడికించాలి.
  3. స్టౌ కట్టేసి వెంటనే మూత తెరవకుండా కాసేపు అలాగే ఉండనివ్వాలి.తర్వాత సర్వ్ చేయాలి.