శుభ్రంగా కడిగిన చికెన్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మిరియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
ఒక చిన్న పెనం వేడి చేసి అందులో ధనియాలు, లవంగాలు, యాలుకలు, అనాస పువ్వు, దాల్చినచెక్క, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తర్వాత గసగసాలు, ఎందు కొబ్బరి పొడి కూడా వేసి 15 సెకన్ల పాటు వేయించాలి.
వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కుడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
నానబెట్టిన చికెన్ ని వేసి ఒకసారి బాగా కలియ తిప్పి, మూత పెట్టి మాదిరి సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
మూత తెరిచి ఒకసారి కూరని కలిపి, 1 tbsp ముందుగా చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఇంకా 2 నుండి 3 tsp ల మిరియాల పొడి వేసి మళ్ళీ కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.