ఒక బాణలిలో 5 నుండి 6 tbsp ల నూనె వేడి చేయాలి.
అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
చికెన్ కూడా వేసి, ఒకసారి బాగా కలిపి, మీడియం హీట్ మీద 5 నుండి 7 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.
తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
మూత పెట్టి 3 వంతులు ఉడికేవరకు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
చికెన్ 3 వంతులు ఉడికిన తర్వాత అందులో గోంగూర పేస్ట్, గరం మసాలా వేసి కలపాలి.
మూత పెట్టి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.