కడాయి లో నూనె వేడి చేసి అందులో, నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బంగాళాదుంప ముక్కలు,ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.
ఆలుగడ్డలు సగం ఉడికాక అందులో, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టి పూర్తిగా ఉడికేవరకు సన్నని సెగ మీద ఉడికించాలి.
మధ్య మధ్యలో కూరని కలుపుతూ ఉండాలి.లేకపోతే కూర అడుగంటే ప్రమాదముంది.
బంగాళాదుంప ముక్కలు పూర్తిగా ఉడికాక పుదినా ఆకులు, కొత్తిమీర వేసి మరొకసారి కలిపి స్టౌ ఆపేయాలి.