ఒక మందపాటి పాత్రలో నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు వేసి కొద్దిగా వేయించాలి.
తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి మారేవరకు వేయించాలి.
తర్వాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలి.
తర్వాత 1 కప్పు పల్చని పెరుగు, పుదీనా, కొత్తిమీర, నిమ్మ రసం కూడా వేసి బాగా కలపాలి.
వేయించి పెట్టుకున్న చికెన్ టిక్కా ముక్కలు కూడా వేసి బాగా కలిపి నూనె అంచులకు చేరే వరకు మీడియం సెగ మీద ఉడికించాలి. (ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలి).
ముక్కలతో కూడిన సగం గ్రేవీ ని గిన్నె లో నుండి పక్కకు తీసి పెట్టుకోవాలి.
తర్వాత గిన్నెలో మిగిలిన కూరను సర్ది దాని మీద 80 శాతం వండిన బాస్మతి అన్నం సగం వేయాలి. కొద్దిగా పుదీనా ఆకులుం కొత్తిమీర, నెయ్యి వేసి తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీ ని పైన వేయాలి.
మిగిలిన అన్నం కూడా పొర లా వేసి దాని పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసి గిన్నెను తడి బట్టతో గానీ, అల్యూమినియం ఫాయిల్ తో గానీ ఆవిరి బయటకు పోకుండా కవర్ చేయాలి.
మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు బాగా సన్నని ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించి తర్వాత స్టవ్ కట్టేయాలి. ఒక 15 నుండి 20 నిమిషాలు మూత తెరవకుండా అలానే ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.