పెనం వేడి చేసి అందులో ధనియాలు, సోంపు, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు వేసి చక్కటి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి.
స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు చల్లారనివ్వాలి.
ఈ లోపుగా ఏలకులు లోపల నుండి గింజలు బయటకు తీసేసి బయట తొక్కలు పడేయాలి.
మసాలా దినుసులన్నింటిని మిక్సిలో వేసి మెత్తగా పొడి కొట్టాలి.
మూత బిగుతుగా ఉన్న డబ్బాలో పులావు మసాలా ను స్టోర్ చేసుకోవాలి.