Print
Baingan Biryani Telugu Recipe
గుత్తి వంకాయలతో చేసిన రుచికరమైన హైదరాబాదీ బిర్యానీ
Course
Main Course
Cuisine
Hyderabadi
Prep Time
25
minutes
Cook Time
30
minutes
Total Time
55
minutes
Author
బిందు
Ingredients
స్టఫింగ్ మసాలా కొరకు
500
గ్రాములు
గుత్తి వంకాయలు
2
tbsp
ధనియాలు
2
tbsp
పచ్చిశనగ పప్పు
1
tsp
జీలకర్ర
1
tsp
నువ్వులు
2
tbsp
పల్లీలు
6 లేదా 7
మెంతి గింజలు
5 లేదా 10
గ్రాములు
చింతపండు
5
వెల్లుల్లి రెబ్బలు
5 లేదా 6
ఎండుమిరపకాయలు
౩
లవంగాలు
½
అంగుళం
దాల్చినచెక్క
మారినేషన్ కొరకు
½
tsp
పసుపు
2
tbsp
కారం
1
tbsp
బిర్యానీ మసాలా
ఉప్పు తగినంత
1 ½
tbsp
అల్లం వెల్లులి పేస్ట్
2
tbsp
పచ్చిమిర్చి తరుగు
¼
కప్పు
డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు
¼
కప్పు
పుదీనా ఆకులు
500
గ్రాములు
పెరుగు
¼
కప్పు
కొత్తిమీర
2
tsp
నెయ్యి
అన్నం వండుట కొరకు
350
గ్రాములు
బాస్మతి బియ్యం
2 లేదా ౩
లీటర్ల నీళ్ళు
ఉప్పు తగినంత
అన్ని గరం మసాలా దినుసులు
2
tbsp
నూనె
గుప్పెడు
పుదీనా ఆకులు
బిర్యానీ కొరకు
¼
కప్పు
డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు
¼
కప్పు
పుదీనా ఆకులు
4 లేదా 5
tbsp
నూనె
2
tsp
నెయ్యి
¼
కప్పు
కొత్తిమీర తరుగు
అల్యూమినియం ఫాయిల్
Instructions
బియ్యం నానబెట్టుట
బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టాలి.
వండే ముందు 2 నుండి ౩ సార్లు కడగాలి.
స్టఫింగ్ మసాలా కొరకు
పెనంలో నూనె వేడి చేసి ధనియాలు, పచ్చి శనగ పప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు వేసి బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించాలి.
తర్వాత జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, దాల్చినచెక్క, చింతపండు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ కట్టేసి కాసేపు చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సిలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత స్టఫ్చేయడానికి వీలుగా గట్టి ముద్దగా పేస్ట్ చేసుకోవాలి.
మారినేషన్ మిశ్రమం తయారీ
ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, నిమ్మ రసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, నెయ్యి వేసి బాగా కలపి పక్కన పెట్టుకోవాలి.
మసాలా స్టఫ్ చేయు విధానం
గుత్తి వంకాయలను శుభ్రంగా కడగాలి.
వాటిని ప్లస్ ఆకారంలో కట్ చేసి లోపల పుచ్చులున్నాయేమో చూసుకోవాలి.
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అన్ని వంకయాలలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అన్నం వండుట
గిన్నెలో 2 నుండి ౩ లీటర్ల నీళ్ళు బాయిల్ చేయాలి.
నీళ్ళ రుచి ఉప్పగా అనిపించేంత వరకు ఉప్పు వేయాలి.అన్నం అంటుకోకుండా పొడిగా రావడానికి కొద్దిగా నూనె కూడా వేయాలి.
అన్ని గరం మసాలా దినుసులు, పుదీనా ఆకులు కూడా వేసి మరిగించాలి.
నీళ్ళు మరగడం మొదలవగానే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.
బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది. మళ్ళీ మరిగే వరకు ఆగాలి.
మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా ౩ నిమిషాల సేపు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి.
బిర్యానీ ని అసెంబుల్ చేయుట
వెడల్పు తక్కువగా ఉన్న ఒక మందపాటి పాత్రను తీసుకోవాలి.
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మారినేషన్ మిశ్రమాన్ని ఆ పాత్రలోకి తీసుకోవాలి.
అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను పెట్టాలి.
పైన సగం ఉడికించిన అన్నాన్ని వేసి సమంగా సర్దాలి.
కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి అల్యూమినియం ఫాయిల్ తో గిన్నెను కవర్ చేయాలి.
బిర్యానీ వండుట
పైన మూత పెట్టి 20 నుండి 25 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి.హై ఫ్లేమ్ లో పెట్టకూడదు.
ఒకవేళ వంకాయలు ఉడికినట్లు అనిపించక పొతే బిర్యానీ పాత్రను మరుగుతున్న నీటిపైన ఉంచి ఇంకాసేపు ఉడికించాలి.
ఉడికాక స్టవ్ కట్టేసి మూత తెరవ కుండా కాసేపు ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.