గట్టి పెరుగులో కొద్దిగా నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా పెరుగును బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
చిన్న కడాయి నూనె వేసి వేడి చేయాలి.
నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
అల్లం తరుగు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కొద్ది సెకన్లు వేయించాల్లి.
స్టవ్ కట్టేసి తాలింపు ను ఒక రెండు నిమిషాలు చల్లార నివ్వాలి.
తర్వాత పెరుగు లో వేసి బాగా కలపాలి.
ముందుగా చేసి పెట్టుకున్న మినప వడలను పెరుగు లో వేసి మునిగేలా నొక్కాలి.
పైన కొత్తిమీర తరుగు చల్లి ౩ నుండి 4 గంటల పాటు నాననివ్వాలి.