కడాయి లో నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
పసుపు, కారం వేసి కలపాలి.
టమాటో గుజ్జు వేసి కలిపి నూనె అంచులకు చేరే వేరే వరకు ఉడికించాలి.
ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
అర కప్పు నీళ్ళు పోసి మళ్ళీ కూర దగ్గర పడే వరకు వండాలి.
ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక సారి కలిపాలి.
౩ నుండి 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.