పెనాన్ని సన్నని సెగ మీద వేడి చేయాలి.
అందులో ముందుగా బిర్యానీ పూలు మరియు బిర్యానీ ఆకులు వేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి చక్కని సువాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించాలి
అన్నింటినీ కాసేపు చల్లార నివ్వాలి.
తర్వాత మిక్సిలో కి తీసుకొని మెత్తని పొడి కొట్టుకోవాలి.
ఆ పొడిని ఒక గాలి చొర బడని, మూత బిగుతుగా ఉన్న డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి.