ఒక బంగాళాదుంప ను శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి.
తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
¼ కప్పు నీళ్ళలో శనగపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక పెనంలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు, ఎండు మిరపకాయ వేసి చిటపట లాడే వరకు వేయించాలి.
తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
ఉప్పు, పసుపు, అల్లం తరుగు, కరివేపాకు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలపాలి.
కూరలో నీళ్ళు పోసి బాగా కలిపి కూర మెత్తబడే వరకు వేయించాలి.
తర్వాత శనగపిండి నీళ్ళు పోసి కూర చిక్క బడే వరకు ఉడికించాలి.
కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేసి వేడిగా పూరీలతో సర్వ్ చేయాలి.