రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి తరుగు, ములక్కాడ ముక్కలు, ఉప్పు వేయాలి.
బాగా కలిపి ఉల్లిపాయ తరుగు మెత్తబడే వరకు లేదా ములక్కాడలు ఆలివ్ గ్రీన్ కలర్ లోకి మారే వరకు వేయించాలి.
తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఒక సారి కలపాలి.
రొయ్యలు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
తర్వాత 1 కప్పు నీళ్ళు పోసి, కూరని కలిపి మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
మూత తెరిచి గరం మసాలా వేసి కూర కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించాలి.
కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.