గిన్నెలో నెయ్యి మరియు నూనె వేసి వేడి చేయాలి.
తర్వాత గరం మసాలా దినుసులు అన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ముప్పావు వంతు ఉడికే వరకు ఉంచాలి.
తర్వాత కొత్తిమీర పచ్చి మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
3 ½ కప్పులు(బియ్యం తీసుకున్న కప్పుతోనే) నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
నీరు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బియ్యం వేసి మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి.
అన్నం ఉడకడం మొదలవగానే స్టవ్ సిమ్ లోకి తిప్పి మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.