Print
kothimeera kodi pulao telugu recipe

Kothimeera Kodi Pulao Telugu Recipe

Course Main Course
Cuisine Andhra, Hyderabadi, Telangana
Prep Time 30 minutes
Cook Time 40 minutes
Total Time 1 hour 10 minutes
Author బిందు

Ingredients

నానబెట్టుటకు

  • 2 కప్పులు బాస్మతి బియ్యం(1 కప్పు=120 గ్రాములు)
  • తగినంత నీళ్ళు

గ్రైన్డింగ్ కొరకు

  • 50 గ్రాములు కొత్తిమీర
  • 2 పచ్చిమిరపకాయలు
  • ¼ కప్పు నీళ్ళు

పలావు కొరకు

  • 300 గ్రాములు చికెన్
  • 2 మీడియం ఉల్లిపాయలు నిలువుగా తరిగినవి
  • 2 పచ్చిమిరపకాయలు
  • 1 tbsp అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 tsp ధనియాల పొడి
  • ½ tsp గరం మసాలా
  • 2 tsp నెయ్యి
  • 4 లేదా 5 tbsp నూనె
  • 1 బిర్యానీ ఆకు
  • 2 దాల్చిన చెక్కలు అరంగుళం ముక్కలు
  • 2 మరాఠీ మొగ్గలు
  • 1 జాపత్రి
  • 5 ఏలకులు
  • 4 లవంగాలు
  • 1/8 ముక్క జాజికాయ
  • 1 అనాస పువ్వు
  • 3 ½ కప్పులు నీళ్ళు(బియ్యం తీసుకున్న కప్పుతో)
  • ¼ కప్పు పుదీనా ఆకులు

Instructions

నానబెట్టుట

  1. బాస్మతి బియ్యంలో నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి.
  2. వండే ముందు 2 నుండి 3 సార్లు కడగాలి.

గ్రైండ్ చేయుట

  1. కొత్తిమీరను శుభ్రంగా కడిగి పచ్చి మిరపకాయలతో పాటు కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

పలావు తయారీ

  1. గిన్నెలో నెయ్యి మరియు నూనె వేసి వేడి చేయాలి.
  2. తర్వాత గరం మసాలా దినుసులు అన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
  3. ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  5. చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ముప్పావు వంతు ఉడికే వరకు ఉంచాలి.
  6. తర్వాత కొత్తిమీర పచ్చి మిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
  7. 3 ½ కప్పులు(బియ్యం తీసుకున్న కప్పుతోనే) నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  8. నీరు మరగడం మొదలవగానే నానబెట్టుకున్న బియ్యం వేసి మళ్ళీ ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచాలి.
  9. అన్నం ఉడకడం మొదలవగానే స్టవ్ సిమ్ లోకి తిప్పి మూత పెట్టి పూర్తిగా ఉడికే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.