ఒక సాస్ పాన్ లో బటర్ వేసి కరిగించాలి.
అందులో వెల్లుల్లి తురుము వేసి అర నిమిషం పాటు వేయించాలి.
తర్వాత మైదా పిండి వేసి కలుపుతూ లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
పాలు కొద్ది కొద్దిగా పోస్తూ మైదా పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
ఉల్లిపాయ ముక్క పైన బిర్యానీ ఆకు ఉంచి దానిని లవంగాలతో గుచ్చి సాస్ పాన్ లో వేయాలి.
సాస్ కొద్దిగా చిక్కబడే వరకు మెల్లగా గరిటెతో తిప్పుతుండాలి.
సాస్ చిక్కబడగానే ఉల్లిపాయ తీసి పక్కన పెట్టేయాలి.
తగినంత ఉప్పు వేస్తే వైట్ సాస్ రెడీ.