25 గ్రాముల చింతపండుని కొద్ది నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టాలి.
ఒక పాత్ర పై జల్లెడ ఉంచి అందులో నుండి చింతపండు పులుసు పోయాలి.
మళ్ళీ చింత పండు లో నీళ్ళు పోసి రసం తీసి జల్లెడ గుండా గిన్నెలోకి పోయాలి.
ఇలా పిప్పి మిగిలే వరకు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చింతపండు రసం తయారు చేయాలి.
తాళింపు
ఒక చిన్న పెనంలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
నూనె కాగాక అందులో జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
పచ్చి పులుసు తయారీ
ముందుగా తీసి పెట్టుకున్న చింత పండు రసంలో ఉప్పు, బెల్లం, ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర వేయాలి.
తయారు చేసి పెట్టుకున్న తాళింపు లోని నూనెని చింతపండు రసంలో వంపేసి, జీలకర్ర, ఎండు మిరపకాయ, కరివేపాకులను కచ్చాపచ్చా గా నూరి పచ్చి పులుసు లో వేసి బాగా కలపాలి.