PrintPalli Karam Dosa Telugu Recipe
Prep Time 15 minutes
Cook Time 15 minutes
Total Time 30 minutes
పల్లీ కారం
- ½ కప్పు పల్లీలు వేయించినవి
- 5 to 6 ఎండు మిరపకాయలు
- 10 గ్రాములు చింతపండు
- 4 to 5 వెల్లుల్లి రెబ్బలు
- 1 tsp జీలకర్ర
- 1 tsp ధనియాలు
- ఉప్పు తగినంత
- 2 to 3 tsp నూనె
దోశ కొరకు
- దోశ పిండి తగినంత
- 30 to 50 గ్రాములు ఛీజ్
- నెయ్యి తగినంత
- ½ కప్పు కొత్తిమీర తరుగు
పల్లీ కారం కొరకు
ఒక పెనంలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తర్వాత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు కూడా వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీలోకి తీసుకుని సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
దోశ కొరకు
పెనం వేడి చేసి అందులో రెండు గరిటెల దోశ పిండి వేసి పెనం అంచుల దాకా వచ్చేలా గుండ్రంగా తిప్పాలి.
10 నుండి 15 సెకెన్ల పాటు అలా ఉంచి, పైన పల్లీ కారం పొడి వేయాలి.
దోశ చుట్టూ నెయ్యి వేసి పైన ఛీజ్ తురుము ఇంకా కొత్తిమీర కూడా వేసి ఛీజ్ కరిగే వరకు లేదా దోశ చక్కగా రోస్ట్ అయ్యే వరకు వేయించాలి.