ముందుగా సోంపు మరియు ఏలకులను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పెనంలో వెన్న వేసి కరగనివ్వాలి.
అందులో జీడీ పప్పు వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
జీలకర్ర, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి.
తర్వాత పాలకూర ప్యూరీ, పసుపు, కారం, గరం మసాలా, సోంపు మరియు ఏలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.
1/4 కప్పు నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి స్టవ్ కట్టేయాలి.
వేయించిన జీడిపప్పు ఇంకా క్రీమ్ లతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి.