పనీర్ ను గ్రైండర్ లో వేసి మెత్తగా పొడిలా అయ్యే వరకు తిప్పాలి.
పెనంలో పనీర్ వేసి అందులో స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ కూడా వేసి బాగా కలపాలి.
అందులో నెయ్యి, ఏలకుల పొడి వేసి మళ్ళీ కలపాలి.
తర్వాత ఆ మిశ్రమం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.
ఒక్క సారి కలకండ లా అవగానే పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక 5 నిమిషాలు ఆరాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని నిమ్మకాయ పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకొని గుండ్రంగా ఉండల్లా చేసి పైన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ల తరుగు లతో అందంగా గార్నిష్ చేయాలి.