350 గ్రాముల బియ్యాన్ని 30 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టాలి.
తర్వాత 2 నుండి 3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడగాలి.
ఒక గిన్నెలో 4 నుండి 5 tsp ల నూనె వేడి చేయాలి.
బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మిరియాలు, షాజీరా, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయలు ముక్కలు, పచ్చి మిర్చి, పచ్చి బఠానీ, తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్త బడే వరకు వేయించాలి.
పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
బీట్ రూట్ తురుము వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.
నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలపాలి.
ప్రతి ఒక బియ్యం కప్పుకు 1 ¼ కప్పు నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
బుడగలు రావడం మొదలవ గానే స్టవ్ సిమ్ లోకి పెట్టి అన్నం పూర్తిగా ఉడికే వరకు వండాలి.