ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి జల్లెడలో వేసి నీళ్ళు మొత్తం పూర్తిగా కారిపోయే వరకు ఉంచాలి.
బియ్యాన్ని కొద్ది కొద్దిగా చిన్న మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి.
బెల్లం పాకం తయారీ
ఓకే గిన్నెలో బెల్లం తరుము వేసి పొయ్యి మీద ఉంచాలి.
40 నుండి 50 ml నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగించాలి.
ఇప్పుడు కరిగిన బెల్లం నీళ్ళను హై ఫ్లేమ్ మీద ఉంచి బుడగలు వచ్చే వరకు లేదా మరగడం మొదలయ్యే వరకు కాయాలి.
ఒక సారి మరగడం మొదలవ గానే పాకాన్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో పాకం వేస్తే అది కరిగి పోకుండా అలానే ఉన్నా లేదా వేళ్ళతో దగ్గరగా అన్నప్పుడు ఉండలా తయారయినా పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క.
ఇప్పుడు స్టవ్ ను సిమ్ లోకి తిప్పి, నెయ్యి మరియు ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.
అరిసెల పిండి తయారి
పాకం తయారు చేసిన గిన్నె మీద జల్లెడ ఉంచి అందులో నుండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ జల్లించి
పిండిని కలుపుతుండాలి.
అలా అది చపాతీ పిండిలా గట్టిగా తయారయ్యే వరకు బియ్యం పిండి వేసి కలుపుతూ ఉండాలి.
అరిశెలు వేయించుట
మీడియం సెగ మీద నూనె ని వేడి చేయాలి.
ఈలోపు అరిసెంత వెడల్పు ఉన్న డబ్బా మూత ఒకటి తీసుకొని దాని మీద ప్లాస్టిక్ షీట్ పెట్టి చేతి వేళ్ళకి ఇంకా ఆ ప్లాస్టిక్ షీట్ కి నెయ్యి రాయాలి.
చేతి నిండా అరిసెల పిండి ని తీసుకొని గుండ్రంగా చేయాలి.
ఇప్పుడు దానిని ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి చక్కగా గుండ్రంగా కింద ఉన్న మూత అంచుల దాకా తట్టాలి.
నువ్వుల అరిసెల కోసం పిండిని తట్టే ముందు ఉండలకు నువ్వులను అద్ది అప్పుడు తట్టాలి.
అలా తట్టిన అరిసెలను మెల్లగా నూనెలోకి జారవిడవాలి.నూనెలో వేయగానే అది మునిగి పోతుంది. కాబట్టి అది పైకి తేలే వరకు కదపకుండా ఆగాలి.
పైకి తేలాక ఒక నిమిషం ఆగి అప్పుడు మెల్లగా రెండో వైపుకి తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ సమంగా బంగారు రంగు లోకి మారే వరకు వేయించాలి.
నూనె లో నుండి బయటకి తీశాక రెండు గరిటెల మధ్యన ఉంచి నూనంతా కారిపోయే వరకు గట్టిగా నొక్కాలి.